వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో ఆరవ (6వ) రోజు పరశురామావతారంలో దర్శనమిస్తున్న భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారు
ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా ఆరవ (6వ) రోజు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.
ఈనాటి 08-01-2022 షష్ఠి – శనివారము – పరశురామావతారంలో
శ్రీమహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి కుమారుడై అవతరించి పరశురాముడు (భార్గవరాముడు) అని పిలువబడుతూ దుష్టుడైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవైఒక్కమారు దండెత్తి సంహరించాడు. ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియచేయబడింది.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.