Devotional – భక్తి విశేషాలు

తిరుపతి, 2020 జూన్ 21: టిటిడి స్థానిక ఆలయాల్లో కైంక‌ర్యాలు –  దర్శనం పునఃప్రారంభం

టిటిడి స్థానిక ఆలయాల్లో కైంక‌ర్యాలు –  దర్శనం పునఃప్రారంభం తిరుపతి, 2020 జూన్ 21: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆలయాల్లో ఆదివారం సాయంత్రం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. జూన్ 21వ తేదీన సూర్య‌గ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను శ‌ని‌వారం రాత్రి మూసివేసిన విషయం విదితమే. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు తెర‌చి శుద్ధి, పుణ్యహవచనం నిర్వ‌హించారు. ఆనంత‌రం …

తిరుపతి, 2020 జూన్ 21: టిటిడి స్థానిక ఆలయాల్లో కైంక‌ర్యాలు –  దర్శనం పునఃప్రారంభం Read More »

తిరుమ‌ల‌, 2020 జూన్ 21: శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం

శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం తిరుమ‌ల‌, 2020 జూన్ 21: శ్రీ‌వారి ఆల‌యం త‌లుపులు ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు తీసి శాస్త్రోక్తంగా స్వామివారి కైంక‌ర్యాలు ప్రారంభించారు. సూర్యగ్రహణం కారణంగా శ‌ని‌వారం రాత్రి 8.30 గంట‌లకు ఆల‌య తలుపులు మూసిన విష‌యం విదిత‌మే. ఆదివారం ఉదయం 10.18 గంట‌లకు ప్రారంభ‌మైన సూర్యగ్రహణం మ‌‌ధ్యాహ్నం 1.38 గంట‌లకు ముగిసింది. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సుప్ర‌‌భాతం, …

తిరుమ‌ల‌, 2020 జూన్ 21: శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాలు ప్రారంభం Read More »

 తిరుమ‌ల‌, 2020 జూన్ 21: జీవ‌కోటి ఆరోగ్యం కొర‌కు తిరుమ‌లలో సూర్య‌గ్ర‌హ‌ణ జ‌పయ‌జ్ఞం

జీవ‌కోటి ఆరోగ్యం కొర‌కు తిరుమ‌లలో సూర్య‌గ్ర‌హ‌ణ జ‌పయ‌జ్ఞం తిరుమ‌ల‌, 2020 జూన్ 21: కక‌రోనా వైర‌స్ న‌శించి,  ప్రపంచంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ శ్రీ‌వారి పుష్క‌రిణిలో ఆదివారం రాహుగ్ర‌హ చూడామ‌ణి సూర్య‌గ్ర‌హ‌ణ జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హించారు. టిటిడి నిర్వ‌హించిన ఈ జ‌ప య‌జ్ఞంలో టిటిడి శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్యర్‌స్వామి,  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యు‌లు శ్రీ కృష్ణ‌మూర్తి వైధ్య‌నాథ‌న్,  ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ …

 తిరుమ‌ల‌, 2020 జూన్ 21: జీవ‌కోటి ఆరోగ్యం కొర‌కు తిరుమ‌లలో సూర్య‌గ్ర‌హ‌ణ జ‌పయ‌జ్ఞం Read More »

భద్రాచలం: ది. 21.06.2020న పాక్షిక సూర్య గ్రహణం సందర్భముగా ది. 20.06.2020న రాత్రి గం|| 8.00 నుండి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మూసివేత

ది. 21.06.2020న పాక్షిక సూర్య గ్రహణం సందర్భముగా ది. 20.06.2020న రాత్రి గం|| 8.00 నుండి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మూసివేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం – భద్రాచలం ది. 21.06.2020న పాక్షిక సూర్య గ్రహణం సందర్భముగా ది. 20.06.2020న రాత్రి గం|| 8.00లకు ఆలయమును మూసివేసి, గ్రహణము పూర్తయిన తదుపరి అనగా ది. 21.06.2020న మధ్యాహ్నం గం||2.30 ని||లకు ఆలయ తలుపులు తెరచి ఆలయ శుద్ధి కార్యక్రమము, సంప్రోక్షణ, …

భద్రాచలం: ది. 21.06.2020న పాక్షిక సూర్య గ్రహణం సందర్భముగా ది. 20.06.2020న రాత్రి గం|| 8.00 నుండి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మూసివేత Read More »

సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మూసివేత

సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మూసివేత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానంలో 21వ తేదీ ఆదివా రం ఉదయం సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. తేది:-20/06/2020 శ్రీ స్వామి వారి ఆదాయము  రూ: 2,28,950/- ప్రధాన బుకింగ NILL/దర్శనాలు100/- NILL/- Prachara shaka. 3,575/- వ్రతాలు NILL/- కళ్యాణ కట్ట ——-/- ప్రసాదవిక్రయం 1,81,900/- శాశ్వత పూజలు 6,000/- PGT ప్రసాదం 21,605/- మినీ బస్ …

సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మూసివేత Read More »

తిరుమ‌ల‌, 2020 జూన్ 20: జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం

జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం తిరుమ‌ల‌, 2020 జూన్ 20: జూన్ 21న ఆదివారం (ర‌వివారం) సూర్య గ్ర‌హ‌ణం వ‌స్తున్న కార‌ణంగా ఈ గ్ర‌హ‌ణాన్ని ”చూడామ‌ణి – సూర్య గ్రహణం” అంటారు. ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల మ‌ధ్య ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌ల శ్రీ‌వారి పుష్క‌రిణిలో టిటిడి జ‌ప‌య‌గ్నం నిర్వ‌హించ‌నుంది. ఇందులో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, …

తిరుమ‌ల‌, 2020 జూన్ 20: జూన్ 21న సూర్యగ్రహణం సంద‌ర్భంగా శ్రీ‌వారి పుష్క‌రిణిలో జ‌పయ‌గ్నం Read More »

తిరుమల, 2020 జూన్ 20: సూర్య‌గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో

సూర్య‌గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో తిరుమల, 2020 జూన్ 20: సూర్య‌గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని శ‌నివారం రాత్రి 8.30 గంటలకు మూసివేసినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆలయం తలుపులు మూసివేసిన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. ఈవో మాట్లాడుతూ ఆది‌వారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 8.30 గంట‌ల …

తిరుమల, 2020 జూన్ 20: సూర్య‌గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 19.06.2020:  స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

 స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: ఈ రోజు (19.06.2020) జిల్లా కలెక్టర్ శ్రీ జి. వీరపాండియన్ మరియు జిల్లా ఎస్పీ డా. కె ఫక్కీరప్ప శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు వారు దేవస్థానం ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్లను మరియు కరోనా నియంత్రణకు చేపట్టబడిన ముందస్తు చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థానం తీసుకుంటున్న ఆయా ముందస్తు జాగ్రత్తల గురించి కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్. రామరావు వివరించారు. …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 19.06.2020:  స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ Read More »

తిరుపతి. 19 జూన్ 2020: సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే. : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే. : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తిరుపతి. 19 జూన్ 2020: ” తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తామని పాదయాత్ర లో నేను మాటిచ్చాను. ఆ పని చేయాలి ” టీటీడీ ఛైర్మన్ గా తనను నియమించాక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొదటి మాట ఇదేనని శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తూ …

తిరుపతి. 19 జూన్ 2020: సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే. : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి Read More »

తిరుప‌తి, 17 జూన్‌ 2020: సూర్యగ్రహణం సంద‌ర్భంగా జూన్ 21న‌ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత‌

సూర్యగ్రహణం సంద‌ర్భంగా జూన్ 21న‌ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత‌ తిరుప‌తి, 17 జూన్‌ 2020: సూర్య‌గ్రహణం కారణంగా టిటిడికి అనుబంధంగా ఉన్న‌ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో  జూన్ 21వ తేదీన మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆల‌య త‌లుపులు మూసి ఉంచుతారు. జూన్ 21న ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల …

తిరుప‌తి, 17 జూన్‌ 2020: సూర్యగ్రహణం సంద‌ర్భంగా జూన్ 21న‌ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు టిటిడి స్థానిక ఆలయాల మూత‌ Read More »