Kalavaibhavam.com(5-Jan): మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు – ఉచిత వైద్య శిబిరములో పాల్గొన్న శిల్పారామం సిబ్బంది మరియు స్టాల్ల్స్ యజమానులు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు – ఉచిత వైద్య శిబిరములో పాల్గొన్న శిల్పారామం సిబ్బంది మరియు స్టాల్ల్స్ యజమానులు
అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ సందర్బంగా ఈ రోజు సాయంత్రం అంఫి థియేటర్ లో భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి.
బెంగళూరు నుండి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి కుమారి కుసుమ ప్రదర్శన ఆద్యంతం అలరించింది.
కొలకత్త ఖరాగపూర్ నుండి వికాస్ నాట్యమండలి గురువు శ్రీమతి భారతీమోహన్ శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఆకట్టునున్నాయి.
ఉదయం శిల్పారామం మరియు గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ లియోనెస్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటుచేయడం జరిగినది. శిల్పారామం సిబ్బంది మరియు స్టాల్ల్స్ యజమానులు పాల్గొని వైద్యశిబిరంలో చూపించుకున్నారు.
డా. లియోనెస్ శ్రీలత రెడ్డి, డా. శారద, డా. మానస, డా. హర్షిత మొదలైన వారు పాల్గొని వైద్య సహాయం అందించి మందులు ఇచ్చారు.