మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో సందర్శకుల సందడి
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి రమణి సిద్ధి శిష్య బృందంచే అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా లో సందర్శకులు సందడి చేస్తున్నారు. 400 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణ లో ప్రతిరోజు ఉదయం 10 .30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి.
గుజరాత్ డెకొరేటివ్ వాల్ హ్యాంగింగ్స్, పిల్లో కవర్లు, బాగ్స్ , క్రోషియా వర్క్ టేబుల్ క్లోత్స్, బంజారా వర్క్ బాగ్స్, డోర్ మాట్స్,రాజస్థానీ పెయింటింగ్ వర్క్స్ , మొదలైనవి ఎంతగానో ఆకర్షణీయంగా ఉన్నవి.
ఈరోజు సాయంత్రం శిల్పారామం ఆంఫి థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి రమణి సిద్ధి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
ఆనంద గణపతి, జయము జయము, రామాయణ శబ్దం, శివ పాద మంజీరా నాదం, కొలువైతివారంగా సాయి, బృందావన నిలయేహ్, భామాకలాపం, కృష్ణం కలయ సఖి అంశాలను అన్షు, మహిత, ప్రియవర్షిణి, సరితా, సింధు, చంటి, హాసిని, దినకర్, మీనా, పుష్పలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
The point of view of your article has taught me a lot, and I already know how to improve the paper on gate.oi, thank you. https://www.gate.io/ja/signup/XwNAU