శ్రీ త్యాగరాయ గానసభ: గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్  

గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్  


శ్రీ త్యాగరాయ గానసభ (11-July-2021): గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. ఆదివారం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయిదేశ్ ముఖ్ జయంతి సభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్ధన మూర్తి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ రచయిత్రిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్త గా విశేషంగా సేవలు అందించారని అన్నారు. చెన్నై, హైదరాబాదులలో ఆంధ్ర మహిళా సభలను స్థాపించారని, భారతదేశం రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలుగా విశేషంగా సేవలు అందించారని పేర్కొన్నారు. భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పేరును సంపాదించారని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది తోట శ్రీలక్ష్మి, జ్ఞాన సభ పాలకవర్గ సభ్యులు శ్రీ లత వర్మ తదితరులు పాల్గొన్నారు.

2 thoughts on “శ్రీ త్యాగరాయ గానసభ: గొప్ప సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్ ముఖ్  ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *