భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా తొమ్మిదవ (9వ) రోజు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామిరు
ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా తొమ్మిదవ (9వ) రోజు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామిరు
ఈనాటి 11-01-2022 నవమి – మంగళవారం – శ్రీకృష్ణావతారంలో
దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా అవతరించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి బోధించి మానవ ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియచేయబడింది.