మాదాపూర్ శిల్పారామంలో సందర్శకులను ఆకట్టుకున్న రంగురంగుల పక్షులు, బోటు షికారు
తాజాగా లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం మాదాపూర్ శిల్పారామంలో ఈరోజు సందర్శకుల కోసం ఉదయం పదిన్నరకు తెరుచుకుంది. సందర్శకులు విచ్చేసి ఎంతో ఉత్సాహంగా శిల్పారామం అంతా కలియ తిరిగారు.
చిన్న పిల్లల ఆహ్లాదం కొరకు కొన్ని రంగు రంగుల పక్షులను పిల్లల ఆట స్థలం దగ్గరలో ఏర్పాటుచేయడంతో పాటు బాటరీ కార్ కూడా నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. చిన్నారులు రంగురంగుల పక్షులను చూస్తూ, బోటు షికారు చేస్తూ ఎంతో సంతోషంగా గడిపారు.
సందర్శకులు అందుబాటులో వున్నా కొన్ని చేనేత హస్త కళల స్టాల్ల్స్ సందర్శించారు. కోవిద్ నిబంధనలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
Your article gave me a lot of inspiration, I hope you can explain your point of view in more detail, because I have some doubts, thank you.