Kalavaibhavam.com(22-Dec): రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్.

మహిళల కు ఆత్మరక్షణ, ధైర్య సాహసాలు పెంపొందించే ఈ శిక్షణా శిబిరాన్ని కర్రసాము లో పిఎహ్.డి చేసిన ఆకుల శ్రీధర్  ఆధ్వర్యంలో లో మహిళల, విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ శిక్షణా తరగతులలో స్వయంగా కర్రసాము, సెల్ఫ్ డిఫెన్స్ లను చేసి విద్యార్థుల కు మార్గదర్శనం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉందన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

1 thought on “Kalavaibhavam.com(22-Dec): రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న కర్రసాము శిక్షణా శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *